27, జులై 2015, సోమవారం

తెల్లవారు ఝామున ,బ్రహ్మ ముహూర్తం లో నిద్ర లేచి ....... ?
లేస్తే ? చాలా చాలా మంచిది .. ఇది అందరికీ తెలిసిన విషయమే . మరల మరల తెలుస్తున్న విషయమే .. కొన్ని విషయాలు అంతే .. ప్రతి సారీ క్రొత్తగా తెలుస్తూనే వుంటాయి .. సూర్యోదయం , సూర్యాస్తమయం బట్టి మన పగలు ఏం  చేయాలి, ఏం చేయకూడదు ,రాత్రులు ఏం చేయాలి , ఏం చేయకూడదు అన్న నియమాల్ని పెద్దలు{పూర్వీకులు } వివరించారు .. ఆరోజుల్లో నిష్టగా ,నియమంగా ఆచరించారు ,ఆచరించి చూపారు తరువాతి తరాలకు. అనుభవజ్ఞుల్ని తేలికగా చూడకూడదు . ఇప్పుడు జరుగుతున్నది అదే ......
సూర్యోదయానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజ చేసుకోవాలి లేదా ధ్యానం చేసుకోవాలి లేదా వ్యాయామం చేసుకోవాలి అనేది ఒక నియమం .. కారణం నిద్రలో ముందురోజుకి సంబంధించిన సంఘటనల ప్రభావం తాలూకు కలలు ,వాటిద్వారా కలిగే  మానసిక అలజడులు మరుసటిరోజుకి కొనసాగకుండా ఆరోజు ప్రశాంతంగా గడవాలి .. ఒక విషయం గమనించాలి .-- మనసుకి , శరీరానికీ అవినాభావ సంబంధం  వుంది .. మన బ్లాగర్ ఉమాదేవి గారు అనుకుంటా జ్యోతి గారు అడిగిన ప్రశ్నకి మంచి సమాధానం పంపారు - శరీరానికి జ్వరం వచ్చింది . మనసు విలవిలలాడింది . మంచి వాఖ్య .. ఈ సూర్యోదయాన నిద్రలేవడం వల్ల ఆ సమయంలో ఎటువంటి రణగొణ ద్వనులు వుండవు . వాతావరణం ఒకరకమైన ప్రశాంత స్థితిలో వుంటుంది . చల్లటి గాలులు వీస్తాయి. మనకి అవసరమైన ఆక్సిజెన్ సరఫరా కాలుష్యం లేకుండా వుంటుంది .. ఇంత మంచి స్థితి మనం అనుభవిస్తే మనసు ,శరీరం ఒక రకమైన తేలిక భావనతో , ప్రశాంతంగా తదుపరి ఎంతటి పని అయినా చేయడానికి సిద్ధపడిపోతుంది ... ఫలితం మంచిగా వుంటుంది .. అందుకే విద్యార్ధులని కూడా తెల్లవారు ఝామున చదువుకోమని చెప్తూ వుంటాము ..

ఇక నా ఆలోచన ఏమిటంటే పూర్వపు రోజుల్లో స్కూల్ పని వేళలు  చాలా లీజర్  గా   అంటే పది గంటల సమయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమె వుండేవి .. ఆనాడు తెలివితేటలు కలిగిన , అధికారాల్లోనికి వచ్చిన విద్యార్ధులు లేరా ? 
ఒత్తిడి అన్న మాట అప్పుడు వుండేదా ? ఆరోజుల్లో ప్రజలు హాయిగా లేరా ?
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈనాటి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం అన్నది గృహిణులు నోట్లో నీరు కూడా పోసుకోలేనంతగా హడావిడిగా వంటగదిలోనికి పరుగులు పెట్టేంత స్థితికి దిగజార్చింది ..తెల్లవారి   నాలుగు లేదా ఐదు  గంటల నుండి ఇంటిలోని వారు వారి వారి పనులమీద బయటకి వెళ్ళేంతవరకూ వురుకులూ , పరుగులూ... ఆ తర్వాత నెమ్మదిగా తన బ్రష్ ,స్నానం , ఉపహారం ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు .. ఇది ఒత్తిడి కాదా .. ఇది మన ప్రాచీన నియమాన్ని ఉల్లంగించడం కాదా ? ఇక ఆరోగ్యం ఎక్కడినుండి వస్తుంది చెప్పండి .
గృహిణి ,హౌస్ వైఫ్ నుండి హోం మేకర్ గా పదం మారింది .. కరెక్టే .. కానీ స్థితి మారలేదు .. ఇల్లాలు ఆరోగ్యంగా వుంటే ఇల్లు బాగుంటుంది .. ఇల్లు బాగుంటే ఇంటిలో నివాసం వున్నవారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలకాలం వర్ధిల్లుతాయి .. అంతేతప్ప అసలు మూలం వదిలేసి కొంచెం తేడా చేసినా గుడులకీ ,గోపురాలకీ పరుగులు పెట్టడం అవసరమా ?
కొసమెరుపు : ఎవరికొ ఒంట్లో బాగోలేదు .. డాక్టర్ దగ్గరకి వెళ్ళడం మానేసి ఇంకెవరి దగ్గరకో పరుగులు తీసారట చేతబడులు చేసారు అందుకే ఆరోగ్యం పాడయింది అని.. ఆశ్చర్యం అనిపించింది .. మన అనారోగ్యం మన విధి విధానాల బట్టే కదా .. బాగున్నా , పాడినా మనకి  మనమే కారణం .. కాదా     


       










         .    

26, జులై 2015, ఆదివారం

మహాపాపం

ఆత్మహత్య మహాపాపం ... ఈ వాక్యం మనం నిత్యం ఎక్కడో అక్కడ చదువుతూనే వుంటాం ..అవును కదా అని అనుకుంటూనే వుంటాము ..  కానీ ఆ పరిస్థితికి దారితీసిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా వుండాలని మాత్రం ప్రయత్నం చేయము .. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కానిది కాని , ఒక్కరితో మొదలై ఎందరినో సమకూర్చుకోవచ్చు .. కానీ ఆ ఒక్కరము ముందుకు రాము .. భయం .. మనవి పిరికి ఆత్మలు .. ఆత్మహత్య పిరికితనం అంటాము .. కాదు. ఏంటో ధైర్యం వుంటేనే గాని ఆ పని చేయలేరు .. ఇది నిజం   .
అసలు ఈ హత్యలూ , ఆత్మహత్యలూ ఏమిటి ?ఎందుకు ?
ఒత్తిడి భరించలేక ఆత్మహత్య , అప్పులు తీర్చలేక ఆత్మహత్య, ప్రక్కవారు ఏదో అన్నారని ఆత్మహత్య ..
మనది కుటుంబ వ్యవస్థ . కుటుంబం అంటే సహజీవనం .. ఒకరికోకరుగా తోడుగా నీడగా వుండాలని , ఒకరి భాద్యత మరొకరు స్వీకరించాలని కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు .. అంతే  కాకుండా వ్యవస్థని అభివృద్ధి దిశలో నడిపించడానికి కూడా కుటుంబ వ్యవస్థ సహకరిస్తుంది.  జన సమృద్ధి ఆరోగ్యకరంగా వుండే అవకాశం వుంటుంది .
అందుకే వివాహ వ్యవస్థని పరిచయం చేసారు మన పెద్దలు . . అటువంటి కుటుంబవ్యవస్థ ని కాదని అనుకుంటున్నారు ఈనాటి తరం . ఇది శోచనీయమే  .             

24, జులై 2015, శుక్రవారం

శోచనీయం : గోదావరి పుష్కరాలు

శోచనీయం : గోదావరి పుష్కరాలు: గోదావరి పుష్కరాలు . . ఎంతో పవిత్ర చరిత్ర కలవి. అందరినీ పులకరింప చేసేవి .. ఈ సందర్భంగా ...  , ... బృహస్పతి  సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గ...

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు .. ఎంతో పవిత్ర చరిత్ర కలవి. అందరినీ పులకరింప చేసేవి .. ఈ సందర్భంగా ...  , ... బృహస్పతి  సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుపుతారు ముద్గలుడు అనే ముని శివుని కోసం తపస్సు చేసి తనను శివునిలో ఐక్యం చేసుకోమని కోరగా తనలో వున్న అష్టవిధ శక్తులలో ఒకటైన జలంలో ముద్గలుని కలుపుకున్నాడని , అది తెలిసి బ్రహ్మ కూడా శివుని గూర్చి తపస్సు చేసి శివుడిలో వున్న జలతత్వాన్ని వరంగా ఇవ్వమని కోరగా భూమండలాన్ని కమండలంగా మార్చి , అందులో జల తత్వాన్ని నింపి బ్రహ్మకు ఇచ్చాడు శివుడు . అది చాలా శక్తివంతమైన జలం కావున ఒక మడుగుని సృష్టించి అందులో ఆ జలాన్ని పోశాడు బ్రహ్మ . ఆ జలమే పుష్కరం ఐంది అని ఎక్కడో చదివాను. బృహస్పతి మహర్షి, బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మెప్పించి దైవ గురుత్వంతో పాటు పుష్కరుని తన వశం చేయమని అడిగాడట . అందుకు పుష్కరుడు అంగీకరించలెదు. బ్రహ్మ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు . బృహస్పతి ప్రభావం వుండే నదిలో పుష్కరుడు ఆ సంవత్సరం పాటు వుండాలి అని నిర్ణయం జరిగింది  ... ఇంకో కధ కూడా చదివాను. సమస్త జీవులు మహా నదులలో తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటుంటే ఆ నదులన్నీ పాపపంకిలమై పోతాయి..  జీవుల పాపాలతో నిండిన నదులు తిరిగి పవిత్రతను ఎలా పొందగలవు అనే సందేహం కలిగింది పుష్కరుడు అనే బ్రాహ్మణుడికి.  జీవుల పాపాలను పునః పావనం చేసేందుకు ఏదైనా చేయాలనుకుని, శివుని కోసం తపస్సు చేయగా, శివుడు సంతసించి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు . నదులను పునఃపావనం చేయగల జలసిద్ధి ప్రసాదించాలని వేడుకొన్నాడు పుష్కరుడు . వరం అనుగ్రహించాడు పుష్కరుడు .. అది తెలుసుకున్న బ్రహ్మదేవుడు పుష్కర తత్వాన్ని తన కమండలంలో భద్రపరచుకున్నాడు బ్రహ్మ .. అహల్యను వంచించిన దేవేంద్రుని గౌతముడు శాపం ఇవ్వగా ఇంద్రుడి
శరీరం అంతా  స్త్రీలింగాలు   ఏర్పడతాయి. తన వికృత రూపాన్ని భరించలేని ఇంద్రుడు తరుణోపాయం కోసం దేవగురువు ఐన బృహస్పతిని ఆశ్రయించగా బృహస్పతి ఆతడిని బ్రహ్మ వద్దకు తీసుకు వెళ్లి ప్రార్ధిస్తాడు . అప్పుడు బ్రహ్మదేవుడు మందాకినీ వద్ద ఒక సరోవరాన్ని సృష్టించి అందులో తన కమండలంలోని జలాన్ని ప్రోక్షిస్తాడు .  అందులో   స్నానం చేసిన ఇంద్రుడు తన పూర్వ రూపాన్ని పొందడం చూసిన బృహస్పతి పుష్కర జల మహిమకు చకితుడై తనకూ పుష్కర తత్వాన్ని కల్పించాలని బ్రహ్మ దేవుడిని వేడగా బ్రహ్మదేవుడు  అనుగ్రహిస్తాడు.  . పుష్కర జల మహిమ ముల్లోకాలకూ ప్రాకి మహా నదులన్నీ పుష్కర సంగమం కొరకై బ్రహ్మని ప్రార్ధిస్తాయి.  బ్రహ్మదేవుడి నిర్ణయం మేరకు గురుడు ఒక్కో రాశిలో ప్రవెశించెటపుడు పన్నెండు రోజులు, ఆ రాశిని విదిచేముందు పన్నెండు రోజులు  చొప్పున పన్నెండు నదులలో వుండేందుకు పుష్కరుడు అంగీకరించగా పుష్కర కాలంలో ఆ నది తీరాన జరిపే జపహోమాదులు, పితృ తర్పణలు, దాన ధర్మాలు సహస్రాదికంగా ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి ..    
ఇదేమిటి , హెడింగ్ శోచనీయం అని పెట్టి ఆధ్యాత్మిక వివరాలు ఇస్తుంది అని అనుకుంటున్నారు కదూ .. అసలు విషయానికి వస్తాను. . ఎన్నో సంవత్సరాల నుండి మనసులో ఏదో దిగులు , గాయాలు , ఒత్తిళ్ళు .. నా కోసం కాదు .. సమాజంలో జరుగుతున్నవిషయాలు  ,కలుగుతున్న పరిణామాలు గురించి .. ఒకోసారి ఒకో దెబ్బ , ఒకోసారి ఒకో గాయం .చాలా లోతుగా ..సునామీ - ప్రకృతి వైపరీత్యం .. గాలీ వానా- ప్రకృతి వైపరీత్యం...  మరి అగ్ని ప్రమాదాలూ ,హత్యలు , ఆత్మహత్యలూ ?  .ఏ  సమస్యకైనా సమాధానం వుంటుంది ,   అసలు సమస్య అన్నది లేనే లెదు. అన్నీ మన చేతుల్లోనే వుంటాయి . వాటిని మనకి అనుగుణంగా మలచుకోవడంలో మనం సమర్ధులం కావాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే .. నిజమే .. అన్నిటికీ ఒక అంతం అనేది వుంటుంది . మరి ఎందుకీ అలజడి అంటే , కొన్ని సమస్యలు కాదు కాదు మనకి నిత్యం ఎదురవుతున్న విషయాలు మనకి అన్నీ వున్నా సంతోషంగా వుండనీయడం లేదు .. తాత్కాలిక మార్పులు మనకి సంతోషం ఇవ్వడం లేదు . సినిమా రెండు గంటలు లేదా కొన్ని గంటలు , ఐస్క్రీం మన నోటిలో కరిగిపోయెంతవరకూ మనకి ఆనందాన్ని ఇస్తాయి . అఫ్కోర్స్ ఆ ఫ్లేవర్ వుంటుంది మిగిలి అనుకోండి  ....కాని మనల్ని సతమతం చేస్తున్న సమస్యలు ఎన్నో . వాటిలో ఈ గోదావరి పుష్కారాల వుదంతం .  ఎదురు చూపులు , వాదనలు , ప్రతివాదనలు ... విపరీతాలు , మరణాలు, యాక్సిడెంట్లు, ఎన్నో కధనాలు , మరెన్నో డిస్కషన్లు .. పరిషారం ? పది లక్షల పరిహారం .. ఇంతేనా .. ఇదేనా ?? కాదు కాదు ఏదో వుంది అది తెలుసుకోవాలి ముందు .. అందుకే నా మనసులో మెదిలే ఆలోచనలు నా వరకే పరిమితం చేసుకోకుండా ఇలా షేర్ చేయాలని ఎప్పట్నుండో ఆలోచన ... అందుకే ఈ ప్రయత్నం .. వెరసి ఫైనల్ కన్క్లుజన్ ఫర్ టుడే ఇస్ ---గోదావరి పుష్కరాలు మనకి పుణ్యం మిగిల్చి తనలో మన పాపాల్ని కడిగేస్తే ,తనలో అడుగు పెట్టకముందే ప్రాణాలు కోల్పోయిన వారికి దొరికింది పుణ్యమా , పాపమా ?  కారకులు రాజకీయమా , వారి పూర్వజన్మ కర్మల ఫలమా ??????????????      
నా ఆలోచన ... దేశంలో ఎన్నికలు జరగవచ్చు , మనకి నచ్చిన నాయకులని ఎన్నుకోవచ్చు .. అధికారం కొందరికి వుంటే మిగిలిన వారికి వారిని ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది ..  ప్రతి పక్షానికే కాదు సామాన్య  మానవునికి కూడా ఆ అధికారాన్ని ఇచ్చింది .. ఒక్క ప్రశ్నించడం లోనే ఆగిపోకుండా అధికారం లో వున్న ఎవరికైనా తమ సహకారం అందించకూడదని ఎక్కడైనా వ్రాసి వుందా .. ? కేవలం విద్యార్ధులు , కొంతమంది ప్రజలు మాత్రమె ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ వుంటే మిగిలిన వారు ? నాకేమని అనుకోబట్టే కదా ఇన్ని ఆపదలు ,అవాంచనీయ సంఘటనాలు ... తోసుకుని మరీ దేవుడి దర్శనం కావాలా ? నలుగురిని త్రొక్కి మరీ పుణ్యం సంపాదించుకోవాలా ? 
ఇక నాకు తెలిసిన  ప్రత్యక్ష అనుభవం .. (వృద్ధుల్ని,పసిపాపల్ని  తీసుకురావద్దు అని ఈ ఘటనల తర్వాత మీడియా లో ప్రచారం .. అంతకు ముందు ఏమైంది ? ).. 
మాకు  తెలిసిన ఆమె  మామగారు ఎంత  చెప్పినా వినకుండా ,ఈ దుర్ఘటన మీడియా లో చూసికూడా గోదావరి పుష్కరాలకు వెళ్ళాలి అని పట్టుబడితే ,తప్పక...  తీసుకువెళ్లారు ..  స్వంత వాహనం అయినా రద్దీ దృష్ట్యా ఒక కిలో మీటర్ దూరం లో ఆపబడింది ..విపరీతమైన ఎండ .. ఆమె మామగారు కోటిలింగాల రేవు ఇంకా అర  కిలో మీటర్ దూరం    వుంది అనగా జంక్షన్ లో (గమనించండి , చుట్టూ ఏంతోమంది పోలీసులు, వారి వాహనాలు రెండో ,మూడో వున్నాయి .. స్పెషల్ కలెక్టర్,ఆయన చుట్టూ మందీ మార్బలం  కూడా వున్నారు ) అమ్మో, నేనింక రాలేను అని ఆయన చేతులెత్తేశారు .. వెనక్కి రాలేక, ముందుకి తీసుకు వెళ్ళలేక అసహాయతతో   పోలిసుల హెల్ప్ కోరితే సబ్ ఇన్స్పెక్టర్ కోసం వెదికారు .. ఆతను ఆ స్పెషల్ కలెక్టర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు. విషయం చెప్తే స్పెషల్ కలెక్టర్ వైపు చూపాడు .. వెంటనే స్పెషల్ కలెక్టర్ దగ్గరకి వెళ్లి సహాయం కోరితే ఆయన స్పందించి ఎవరికో కాల్ చేసి అర్జెంటు గా వాహనం పంపమని కొరారు.. కాని రాలేదు .. పది నిమిషాల తర్వాత అతను తన కార్ లో ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు --సారీ , ఐ యాం హెల్ప్ లెస్ అని ..చెప్పి . దానికన్నా తన వాహనం లో ఈ పెద్దాయనని తీసుకు వెళ్లి వదిలిపెట్టాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు ఆ ఐ .ఏ .ఎస్  కి... ? 108 ఖాళీగా తిరుగుతుంది కాని, ఇటువంటి వారిని గమనించి ఎందుకు సహాయం చేయలేదు ?  రోడ్ల నిండా మంచినీళ్ళ పాకెట్లు ..ఎంత అనౌన్సు చేస్తున్నా వినలెండి స్థితిలో వున్నారా యాత్రికులు ? ఎవరిదీ తప్పు ?   
చిరంజీవి సినిమా రిలీజ్ ఐతే టికెట్స్ కోసం తొక్కిసలాటలో ప్రాణం వదిలిన ఘటనలో ఆ చనిపోయిన వాడికి పుణ్యం దొరికిందా ,లేదా చిరంజీవి కోసం చనిపోయిన ఆనందం దొరికిందా -- ఇది తెలియాలంటే నేనూ పైకి వెళ్ళాలి మరి ... 18 ఎకరాల పొలం వున్న రైతు  బోర్ల కోసం ఋణం తీసుకుని, ఋణం తీర్చలేక రుణ మాఫీ కోసం ఎదురు చూస్తె తీర్చలేదనే ఆత్మహత్యా .....   
ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ? .......