26, అక్టోబర్ 2015, సోమవారం

భూమి మనకు నివాసయోగ్యం .. మన కన్నతల్లి . మనకి నీరు , ఆహారం, అన్ని విధాలా మనల్ని సుఖజీవనం గడిపేలా సకల సంపదలూ మన నోటికి అందిస్తున్న తల్లి . అటువంటి తల్లికి మన మీద ఎందుకు కోపం ?
ఒకప్రక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు ప్రజలు .. కారణం -డబ్బు .. అత్యాశ ...
మరోప్రక్క భూ విలయాలకు అనాధలుగా మారుతున్నారు ,మృత్యువాతకి గురి అవుతున్నారు . ఇవన్నీ చూస్తూనే వున్నాము ప్రతిరోజూ .. అయినా నిమ్మకి నీరెత్తినట్లు మౌనంగా వుండిపోతున్నాము.. మన పనులు మనం చేసుకుంటూ వేల్లిపోతున్నాము .. మనం చాలా చాలా పెద్ద వైరాగ్యులము .. ఇతరుల కష్టాలు పట్టించుకోము .. ప్రక్కవారి జోలికి వెళ్ళము . మనం మాత్రం సుఖంగా వుంటే చాలు .. డబ్బు అనేది మన అవసరాలు తీర్చడానికి వుపయోగించబడే ఒక ఆయుధం మాత్రమే .. ఎంత సంపాదించినా , ఐదు నక్షత్రాల హోటళ్ళలో భోజనాలు చేసినా ముఖ్యమైన్ వస్తువులు మూడు ,నాలుగే  --ఉప్పు,తీపి , కారం ,పులుపు ...ఎంత ధనవంతుడైనా ఈ కాంబినేషన్ లేకపోతె భోజనం సహించదు .. ఎంత  అందంగా ఆహారాన్ని మన ముందు ఉంచినా ఇవి లేకపోతె మనం తినలేము .. అలానే ఎంత సంపాదించినా సమయానికి ఆహారం , నిద్ర వుంటే చాలు .. కానీ, సంపాదనలో ,డబ్బు యావలో పది మానవ విలువలు ,సంబంధాలూ చెడిపోతున్నాయి .. బంధుత్వం కన్నా డబ్బు ముఖ్యం, డబ్బు వుంటే బంధుత్వాలు అవే దగ్గరకి వస్తాయి అనేవాళ్ళని చాలామందిని చూసాను . వారికి నచ్చ చెప్పుకునే కన్నా కాలం నేర్పే పాఠాలకి వారిని వదిలేయడమే మందు ,. అనుభవమే పాఠాలు నేర్పుతుంది .. కాని ,అప్పటికి ఒక జీవితకాలం ముగిసిపోతుంది .. అందుకే అనేది -భగవంతుడిచ్చిన ఈ జీవితానికి సార్ధకత చేకూర్చే ప్రయత్నం లో వుంటే మేలు అని                

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి